Sunday, October 2, 2016


Central Govts contribution to Warangal Development


వరంగల్ జిల్లాకు కేంద్రం వరాలు

1.    దేశంలోని 12 చారిత్రాత్మక నగరాలను గుర్తించి సంవత్సరానికి 40  అభివృద్ధి పరచివారసత్వ సంపద  పర్యాటక రంగాన్ని అభివృద్ధి పరచి ప్రజల ఆదాయం పెంచాలని భావించి కేంద్రం హృదయ్  పథకాన్ని ప్రారంభించగా దానిలో భాగంగా మొట్ట మొదటగా  వరంగల్. మొట్టమొదట  పథకానికి శంకుస్థాపన  చేసింది కూడా వరంగాల్  నగరంలోనే.

2.     హృదయ లో భాగంగా చారిత్రాత్మ వరంగల్ కోట పునరుద్ధరణభధ్రకాలి చెరువు చుట్టూ ట్యాంక్ బండ్  మాదిరిగా భధ్రకాలి బండ్ నిర్మాణం తదితర పనులు చేపట్టారు.

3.  దేశంలోని 100 నగరాలను గుర్తించి వాటిని సంవత్సరానికి 100  కోట్లతో ఆకర్షణీయమైన నగరాలనుగా తీర్చిదిద్దాలని కేంద్రం స్మార్ట్ సిటీస్ ని ప్రకటించగా మొదటి 100 స్మార్ట్ సిటీస్ లో వరంగల్ కు చోటు దక్కింది

4.    దేశంలో ఎడుగుతున్నతివంటి 500 నగరాలను అభివృద్ధి పరచాలని  ప్రారంభించి, దానిలో కూడా వరంగల్  మోడీ ప్రభుత్వం. రకంగా హృదయ్ , స్మార్ట్  , అమృత్  - మూడు పథకాల్లో చోటు కల్పించి, వరంగల్ రూపురేఖలు మార్చడానికి   కేంద్ర ప్రభుత్వం నడుం భిగించింది.

5.      1905 కోట్లతో యాదగిరిగుట్ట  వరంగల్ వరంగల్ వరకు 4 లేన్ జాతీయ రహాదారి

6.  వరంగల్ నుండి ఖమ్మం, వరంగల్ నుండి జగిత్యాల వరకు 4 లేన్ జాతీయ రహాదారిగా మార్చాలని కేంద్రం ప్రతిపాదన

7.    వరంగల్ లో ఉన్నటువంటి చేనేత కార్మికులకు,యువతకు  యువతకు ఉపాధి కల్పించాలని 100 కోట్ల సబ్సిడీతో టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేయాలని కేంద్రం భావిస్తే, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు భూమిని కేటాయించలేదుముఖ్యమంత్రి  వరంగల్ కు వచ్చి భూ సర్వే కోసమని గాలి మోటార్  లో తిరిగిండు గాలి మాటలు చెప్పిందు తప్ప భూమిని మాత్రం కేటాయించలేదు.

8.   వరంగల్ లో పరిశ్రమలు నెలకొల్పడానికి విమానాశ్రయం ముఖ్యమనిమరో 280 ఎకరాలను కేటాయిస్తే మమునూరు విమానాశ్రయం పూర్తి స్థాయి విమానాశ్రయం గా తీర్చిదిద్దుదామని కేంద్రం చెబుతుంటే ఇప్పటికీ దానికి భూమిని కేటాయించలేదు రాష్ట్ర సర్కార్. 20 కోట్లు కేటాయించి ప్రస్తుతమున్న విమానాశ్రయానికి ప్రహారీ గోడ కట్టిస్తుంది కేంద్ర ప్రభుత్వం.

9.     గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో కేంద్రం ప్రారంభించిన రుర్బన్  పథకాన్ని పైలట్ ప్రాజెక్ట్ గా పర్వతగిరి మండలాన్ని  ఎంచుకొని 100 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంది.

10.  విద్యుత్తును అదా చేస్తూ వరంగల్ నగరం లో కాంతులు విరాజిల్లే విధంగా నగరం లోని అన్ని దీపాలలో  ఎల్..డి బల్బులను అమర్చడానికి కేంద్రం 81 కోట్లను కేటాయించింది.

11. వరంగల్ లోని జవహర్ లాల్ నెహ్రు స్టేడియం ని అభివృద్ధి చేయడానికి కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ ద్వారా 5 కోట్ల రూపాయల కేటాయింపు.

12.  వరంగల్ జిల్లాలో బీ జే పీ కి ఒక ఎం.పీ, ఒక ఎం.ఎల్. లేకపోయినా సికింద్రాబాద్ ఎం.పీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ గారు ప్రధాన మంత్రి సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన క్రింద సన్నూర్, అన్నారం షరీఫ్ అనే రెండు గ్రామాలను దత్తత తీసుకున్నారు.

13. మధ్య దళారీలను తొలగించి రైతులకు పంట దిగుబడి కి మెరుగైన ధర లభించడానికి ఉద్దేశించిన జాతీయ ఆన్లైన్ అగ్రికల్చర్ మార్కెట్ కు వరంగల్ మార్కెట్ ఎంపిక

14.  పరిశుబ్రత, పారిశుధ్యం కొరకు వరంగల్  జిల్లాకు ఏడాదికి వంద కోట్లకు పైగా స్వచ్ఛ భారత్ నిధులు.

15. వరంగల్  జిల్లాలో సగటున ఒక్కో గ్రామ పంచాయతీకి 80 లక్షలుమున్సిపాలిటీకి 21 కోట్ల చొప్పున నేరుగా  గ్రామాలకు, నగర పంచాయతీలకు కేంద్రం నిధులను బాధలాయిస్తోంది. స్థానిక అభివృద్ధికి బాటల పరుస్తుంది.

Questions to KCR on Telangana Finances

టీఆర్ఎస్ ప్రభుత్వానికి బీజేపీ సూటి ప్రశ్నలు

1.                   మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్లలో రెవిన్యూ ఎంత పెరిగింది?

2.                   పరిపాలనలో దుబారా పెరిగింది వాస్తవం కాదా?

3.                   పొదుపును పాటించి రాష్ట్ర అభివృద్ధికి ఎన్ని నిధులను అదనంగా సమకూర్చారు?

4.                   మిగులు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రం రెండేళ్లలో లక్ష కోట్ల అప్పుల రాష్ట్రంగా మారింది వాస్తవం కాదా?

5.                   రాష్ట్ర ప్రభుత్వ  ప్రణాళిక బడ్జెట్ లో పెట్టిన నిధులలో సగం కూడా ఖర్చు చేయని స్థితి వాస్తవం కాదా?

6.                   రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కేవలం జీత భత్యాలకు, పరిపాలనా నిర్వహణకు మాత్రమే సరిపోతున్నది వాస్తవం కాదా?

7.                   ఇటువంటి పరిస్థితుల్లో ఏదైనా ప్రగతి సాధిస్తే అది కేంద్ర ప్రభుత్వ సహకారం, నరేంద్ర మోడీ ఘనది అన్నది వాస్తవం కాదా?

8.                   ఆకస్మికం అవసరాల కోసం మునుపెన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి కింద 4,670 కోట్లు కేటాయించారు. ఈ పద్దు కింద ఇప్పటి వరకు ఎంత ఖర్చు చేశారు. కరువులో రైతులను ఆదుకోవడానికి, హైదరాబాద్ లో వరద బాధితులను ఆదుకోవడానికి ఈ నిధులను ఎందుకు ఖర్చు చేయలేదు?

9.                   నీటి ప్రోజెక్టుల కోసం 25 వేల కోట్లు మీరు కేటాయించారు. 6 నెలలు పూర్తి అయింది. ఇప్పటి వరకు కనీసం పావలా వంతు కూడా ఎందుకు ఖర్చు చేయలేదు. ఈ అంకెలు కేవలం ప్రజలను మసి పూసి మారేడుకాయ చేయడానికేనా?

10.               హడ్కో రుణం తో హైద్రాబాద్లో లక్ష ఇండ్లు, మిగితా జిల్లాల్లో ఒక లక్ష ఇండ్లను ఈ సంవత్సరంలో కట్టిస్తామన్న ప్రభుత్వం ఎందుకు కూడా ఒక అడుగు ముందుకు వేయలేకపోతుంది? హడ్కో రుణం పరిస్థితి ఏంటి? కేంద్ర ప్రభుత్వం 90 వేళా ఇండ్ల కోసం ఇచ్చిన నిధులు ఏమయ్యాయి?

11.               జి హెచ్ ఎం సి కి జి హెచ్ ఎం సి నిధులు మినహాయిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా ఖర్చు పెట్టలేదు? మరి రాష్ట్ర ప్రభుత్వం నగర ఎన్నికల్లో ఇచ్చిన హామీల పరిస్థితి ఏంటి?

12.               హెచ్ ఎం డి ఏ కి కేటాయించిన 865 కోట్లలో ఇప్పటి వరకు ఎంత ఖర్చు చేశారు? ఏ వసతుల కోసం ఖర్చు చేశారు?

13.               వరంగల్, కరీంనగర్, రామగుండం, ఖమ్మం, నిజామాబాదు పురపాలక సంఘాలకు 1,200 కోట్లు కేటాయించారు. మరి ఆ నిధులకు ఇప్పటి వరకు ఎందుకు ఖర్చు చేయలేదు. మీ మాటలు కేవలం నీటి మూటలేనా?

14.               మిషన్ భగీరథ కోసం ఖర్చు అయ్యే నిధులను  హడ్కో, నాబార్డ్, కెనరా బ్యాంకు, బ్యాంకు అఫ్ ఇండియా నుండి  సమకూర్చుకుంటాం అన్నారు. ఇప్పటి వరకు ఎంత ఋణం రాబట్టారు? ఎంత ఖర్చు చేశారు? మిషన్ భగీరథ పురోగతి ఎంత?

15.               మీరు గొప్పలు చెప్పుకుంటున్నటువంటి రూపాయికి కిలో భియ్యంలో, 32 రూపాయలకు కిలో భియ్యంలో, 29 రూపాయలు కేంద్రం భారిస్తుంటే మీరు కేవలం 2 రూపాయలు భరిస్తుంది వాస్తవం కాదా?

16.               స్వచ్చ భారత్, మేకిన్ ఇండియా, స్కిల్ ఇండియా వంటి పథకాలను స్వచ్చ హైదరాబాద్, మేకిన్ తెలంగాణా, స్కిల్ తెలంగాణా అని పేర్లు మార్చి కేంద్ర ప్రభుత్వ పథకాలను తమ పథకాలుగా ప్రచారం చేసుకుంటుంది వాస్తవం కాదా?

17.               కేంద్ర ప్రభుత్వ పథకాల్లో కనీసం ప్రధాన మంత్రి ఫోటోను కూడా ప్రచురించకుండా కేవలం ముఖ్యమంత్రి ఫోటోను మాత్రమే ప్రచురించుకుంటూ ప్రోటోకాల్ ను ఉల్లఘిస్తున్నది వాస్తవం కాదా?

18.               అమిత్ షా అబద్ధాలు ప్రచారం చేసారంటున్నారు కదా? ఇంతకుముందే ప్రతి పైసాకు లెక్క చెప్పి నిజానిజాలను ప్రజల ముందు పెట్టాం. మరి ఒక్క హామీని కూడా పూర్తిగా అమలు చేయకుండానే 99 శాతం హామీలు నేరవేర్చామని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రిని ఏమనాలి? పచ్చి అబద్ధాల కోరు ఆనాలా లేక పచ్చి మోసకారి అనాలా?

19.               ఎంత సేపూ మేము ప్రవేశపెట్టిన రుణమాఫీకి డబ్బులు ఇవ్వలేదు, కళ్యాణ లక్ష్మికి డబ్బులు ఇవ్వటం లేదు, మిషన్ భాగీరతకు డబ్బులు ఇవ్వట్లేదు అని టీ ఆర్ ఎస్ నాయకులు గగ్గోలు పెడుతున్నారు కదా. టీ ఆర్ ఎస్ మేనిఫెస్టో కు, మీ రాజకీయ ప్రయోజనాలకు బీ జె పీ ఏమైనా కౌంటర్ గ్యారంటీ  ఇచ్చిందా మీరు ప్రవేశపెట్టే ప్రతి వోట్ బ్యాంకు పథకానికి కేంద్రం నిధులు ఇవ్వడానికి?


20.               కరువుకు కేంద్రం రూ 791 కోట్ల నిధులు మంజూరు చేసిందని మేము ఘంటాపథంగా చెప్తున్నాం. అసలు రాష్ట్ర ప్రభుత్వం తరుపున మీరు ఎన్ని నిధులను కేటాయించారో ఇప్పటివరకు మీరు ప్రజల ముందు ఉంచారా? దీంతో ఎవరి చిత్తశుద్ధి ఏంటో అర్ధం కావడం లేదా?